ప్రముఖ జర్నలిస్టు పాపయ్య శాస్త్రి మృతి

ప్రముఖ జర్నలిస్టు పాపయ్య శాస్త్రి మృతి - Sakshi


 హైదరాబాద్,   సీనియర్ జర్నలిస్టు శివకోటి పాపయ్య శాస్త్రి(78) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 50 ఏళ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. 1955లో డెక్కన్ క్రానికల్ రిపోర్టర్‌గా, 1960-63 వరకు ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్‌గా, 1964-66 గుంటూరులో ఆంధ్ర పత్రిక స్టాఫ్ రిపోర్టర్‌గా, 1967లో ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్‌గా, 1980-91 మధ్య ఆంధ్రప్రభ బ్యూరోచీఫ్‌గా, 1994-2004 మధ్య దూరదర్శన్‌లో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు. శాస్త్రికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, శాస్త్రి అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top