ప్రైవేటు వోల్వో బస్సు దగ్ధం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని చాగల్లు వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు వోల్వో బస్సు మంటల్లో దగ్ధమైంది. తొలుత వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. వోల్వో బస్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు అందరూ బస్సు నుంచి వేగంగా దిగి సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.
బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రయాణికులకు సంబంధించిన సామాగ్రి, మిగతా వస్తువులన్నీ మంటల్లో కాలిపోయాయి. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.