నల్లమలలో భారీ డంప్‌ స్వాధీనం

(ఫైల్ ఫొటో)


ఒంగోలు : ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మావోయిస్టులు పాతిపెట్టిన డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



నల్లమల అటవీ ప్రాంతం పాలుట్ల సమీపంలో పాత డంప్‌ను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఈ డంప్‌లో పెద్ద ఎత్తున తుపాకులు, పలు రకాల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సమయంలో డంప్‌ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top