ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
విజయవాడ: వరద నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేశారు. 98వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
కాల్వలకు 15వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సాయంత్రానికి వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
**