ప్యాసింజర్ రైలు కోచ్లో పొగలు
నూనెపల్లె(కర్నూలు జిల్లా): గుంటూరు-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు కోచ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో పొగలు వచ్చాయి. గుంటూరు నుంచి సికింద్రబాబాద్కు వెళ్తున్న ప్యాసింజర్ రైలు(57306) ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్లో ఆగగానే జనరల్ కోచ్లోని బ్యాటరీలో పొగలు రావడంతో ప్రయాణికులను ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు.
దీంతో రైల్వే టీఎస్ఆర్ విభాగానికి చెందిన శివాజీ, ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన రాందాసు స్పందించి బ్యాటరీ తీగలను తొలగించారు. షార్ట్సర్క్యూట్ బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీ ఏర్పాటు చేసి రైలును సికింద్రాబాద్కు పంపారు.