మే 6 నుంచి పోస్టల్ ఉద్యోగుల సమ్మె


సాక్షి, విజయవాడ బ్యూరో: దేశ వ్యాప్తంగా పోస్టల్ ఉద్యోగులు మే 6 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌పీవో యూనియన్లు కలసి సంయుక్త కార్యాచరణ మండలిగా ఏర్పడ్డాయి. ఉద్యోగుల డీఏను పూర్తిగా మూలవేతనంలో విలీనం చేయాలనీ, 2014 జనవరి నుంచి ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top