పోలియో చుక్కలు వికటించడం వల్లే...


గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మూల జంబం గ్రామానికి చెందిన 15 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. గత ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా  మూలజంబం గ్రామానికి చెందిన పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించారు.


ఆ రోజు నుంచి పిల్లలు వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న తమ పిల్లలకు కేవలం పోలియో చుక్కలు వేయించడం వల్లనే అనారోగ్యం పాలయ్యారని అక్కడి స్థానికులు వాపోతున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top