పోలీసు వాహనం బోల్తా
కడప: ప్రమాదవశాత్తూ పోలీసుల వాహనం బోల్తా పడి డ్రైవర్ మృతిచెందగా, మరో ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం బాక్రాపేట సమీపంలో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు ఓ కేసు విషయమై ప్రైవేట్ వాహనంలో బయలుదేరారు.
వైఎస్ఆర్ జిల్లా బాక్రాపేట వద్దకు రాగానే పోలీసుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కానిస్టేబుళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.