ఎర్ర కూలీలను అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లా శేషా చలం అడవుల్లో పోలీసులు నిర్వహించిన కూబింగ్ లో ఎర్ర చందనం కూలీలు పట్టుబడ్డారు. పాల పల్లి వద్ద అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్ర చందనం కూలీలు ఎదురు పడ్డారు. పోలీసులను చూసి వీరు పారిపోగా.. నలుగురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన కూలీల వద్ద ఆయుధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.