నల్లమలలో కూంబింగ్
కర్నూలు: కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. నల్లమలలో స్మగ్లర్ల కదిలిక నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. రవాణా చేస్తున్న 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కూలీలు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు