రాసలీలలు సాగించిన కానిస్టేబుల్ సస్పెన్షన్
జంగారెడ్డిగూడెం / ఏలూరు: జీలుగుమిల్లి పోలీస్ క్వార్టర్స్లో మహిళతో రాసలీలలు సాగించిన పోలీస్ కానిస్టేబుల్ పి.సతీష్ను సస్పెండ్ చేసినట్టు జంగారెడ్డిగూడెం సీఐ కె.అంబికాప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారానికి సంబంధించి డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించామన్నారు. నివేదికను జిల్లా ఎస్పీ కె.రఘురామ్రెడ్డికి అందజేశామన్నారు. ఈ నేపథ్యంలో సతీష్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారని సీఐ వివరించారు.