117 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

117 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం


వైయస్‌ఆర్‌జిల్లా (చిన్నమండెం): రహస్యంగా బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 117 కిలోల బరువున్న 8 ఎర్రచందనం దుంగలతో పాటు 3ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.



ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు.. చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని దిన్నెమీదపల్లె క్రాస్‌రోడ్డు వద్ద బెంగళూరుకు వెళ్లే బస్సు కోసం వేచి ఉన్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన ఆ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top