పోలవరం పనులు బంద్
పోలవరం : పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా ఇక్కడ పనులేవీ జరగడం లేదు. స్పిల్వే, స్పిల్ఛానల్ నిర్మాణాలకు సంబంధించి ఎర్త్ వర్క్, బ్లాస్టింగ్ పనులు కూడా పూర్తిగా బంద్ అయ్యూరు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. యంత్రాలన్నిటినీ పక్కన పెట్టేశారు. డీజిల్ కొరత కారణంగానే పనులను నిలిపివేశారని తెలిసింది. వేలాది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు డీజిల్ లేక ఆపివేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్న వాదన మరోవిధంగా ఉంది. మూడు రోజుల క్రితం ముంపు గ్రామమైన రామయ్యపేట నిర్వాసితులు ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారని, ఈ కారణంగా ఆ రోజు పనులు నిలిచిపోయాయని హెడ్వర్క్స్ ఈఈ ఆర్వీ మోహన్రావు తెలి పారు. అనంతరం డీజిల్ కొరత, వర్షాల కారణంగా మూడు రోజులనుంచి పనులు నిలిచిపోయాయన్నారు. ఇదిలాఉంటే రామయ్యపేట ముంపు నిర్వాసితుల వాదన మరోవిధంగా ఉంది. తాము ప్రాజెక్టు పనులను అడ్డుకోలేదని, గ్రామసమీపంలో బ్లాస్టింగ్ చేయవద్దని ఇటీవల వచ్చిన జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశామని చెబుతున్నారు. ఏదేమైనా పనులను వేగవంతం చేయాల్సిన సమయంలో పూర్తిగా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.