'పోలవరం ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయండి'

'పోలవరం ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయండి' - Sakshi


ఏలూరు: రైతాంగానికి నష్టం కలిగించే పట్టిసీమ ప్రాజెక్ట్ను వెంటనే నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నర్సాపురం, మొగల్తూరులో దున్నపోతులతో  నిరసన చేపట్టాయి. పోలవరం ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ విరమించే వరకూ గోదావరి జిల్లాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top