చేపల చెరువులో విషం


వంగర (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరపాడు గ్రామంలోని బారికబంద చెరువులో గుర్తుతెలియని దుండగులు విషం కలిపారు. దీంతో గురువారం చెరువులో ఉన్న చేపలు మృత్యువాతపడ్డాయి.  సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్న స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top