రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ


చోడవరం (విశాఖ) : విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు సోమవారం ఆదర్శ రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ

చేశారు. వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురు రైతులు మెషీన్లను అందుకున్నారు.



నాట్లు వేసే సమయంలో ఇవి రైతులకు ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ... గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వీలుగా డ్రిప్ ఇరిగేషన్ విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top