ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
అనంతపురం క్రైమ్: అనంతపురం బైపాస్ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఎదురెదురుగా వచ్చిన ఆటో, బైక్ ఢీకొనగా... బైక్పై ఉన్న ఓబులేసు (30) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామవాసిగా గుర్తించారు.