కలెక్టర్లకు నిత్య పరీక్షలు: సీఎం

కలెక్టర్లకు నిత్య పరీక్షలు: సీఎం - Sakshi

- నైపుణ్యం పెంచుకోవాలన్న బాబు 

- రెండురోజుల సదస్సు ప్రారంభం

 

సాక్షి, అమరావతి: కలెక్టర్లు నైపుణ్యం పెంచు కోవాలని, కలెక్టర్లతో పాటు శాఖాధిపతులు, మంత్రులకు అనునిత్యం పరీక్షలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తద్వారా వారి పనితీరును అంచనా వేస్తామన్నారు. నీరు చెట్టు, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్, కుటుంబ వికాసం, సమాజ వికాసం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. కరువును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అంగీకరించారు.



గురువారం విజయవాడలో ప్రారంభమైన రెండురోజుల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు. ప్రజల సంపూర్ణ సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి లక్ష్యా లుగా తమ ప్రభుత్వం స్వల్ప, మధ్య, దీర్ఘకా లిక ప్రణాళికలతో ముందుకెళుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని, ప్రజలకు అవినీతిలేని పాలన అందించాలనే ఉద్దేశంతోనే ‘ప్రజలే ముందు’ (పీపుల్‌ ఫస్ట్‌) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. రాష్ట్ర విభజన రోజైన జూన్‌ రెండో తేదీన ఏటా నవనిర్మాణ దీక్ష చేస్తున్నామన్నారు. కరువును ఎదుర్కోవడంలో గత ఏడాది విఫలమయ్యామని ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ ఏడాది అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

 

‘ప్రజలే ముందు’ యాప్‌ ఆవిష్కరణ

ప్రణాళిక శాఖ రూపొందించిన హ్యాపీనెస్‌ సర్వే, ప్రపంచ పోటీతత్వ సూచిక, జిల్లాల స్థూల ఉత్పత్తి ప్రచురణలతో పాటు ‘ప్రజలే ముందు’ యాప్‌ను సీఎం ఆవిష్కరించారు.

కాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విందు ఇచ్చారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top