బాబు మోసం ప్రజలు గ్రహించబట్టే...

బాబు మోసం ప్రజలు గ్రహించబట్టే... - Sakshi


సాక్షి, తణుకు: ఎన్నికల ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయడం మాని ఇప్పుడు కొత్తగా జగన్‌మోహన్‌రెడ్డి రుణమాఫీకి వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. తణుకు రైతు దీక్ష దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో తాము రుణమాఫీకి వ్యతిరేకమని జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడూ చెప్పలేదని ఆయన గుర్తు చేశారు.



పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాల మాఫీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారన్నారు. అది మాఫీకి ఎలా వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందుచ్చిన హామీల అమలు విషయంలో ఆయన అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు పసిగట్టారని ధర్మాన చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తుందంటూ స్వయంగా చంద్రబాబు ఎన్నికల ముందే ఎన్నికల సంఘానికి లేఖ రాశారని తెలిపారు.



బాబు మోసపూరిత వైఖరి ప్రజలకు అర్ధమైందని కాబట్టే పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతం అయిందన్నారు. పాలనలో ముఖ్యమంత్రిగా బాబు వైఫల్యం చెందితే, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకరావడంలో జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతం అయ్యారని ప్రజల భావిస్తున్నారని చెప్పారు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారానే ప్రజలకు కావాల్సినవి నేరవేర్చుకోవచ్చని జగన్‌మోహన్‌రెడ్డి ఈ దీక్ష ద్వారా ప్రజలకు వివరించారని, ప్రజలకు అందుకు ఆమోదం లభించిందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top