పుంగనూరులో పింఛన్ సొమ్ము స్వాహా


చిత్తూరు: ప్రభుత్వం పేదలకు, వృద్ధులకు అందిస్తున్న పింఛన్లో చిత్తూరు జిల్లా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. పుంగనూరులో పింఛన్దారులకు అందించాల్సిన లక్షల రూపాయలను అధికారులు స్వాహా చేశారు. గ్రామీణ సామాజిక తనిఖీల్లో ఈ అవినీతి బాగోతం బట్టబైలైంది. మండలంలో చనిపోయిన వారి పేర్లతో ఫించన్లను మంజూరు చేసుకుని ఆ సొమ్మును సెక్రటరీలు తమ జేబులో వేసుకున్నట్లు తేలింది. సెక్రటరీల అవినీతిపై ఉన్నతాధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top