భీమాళిలో పెళ్లికథ సందడి
♦ పలు సన్నివేశాల చిత్రీకరణ
♦ కథానాయికగా లక్కవరపుకోట అమ్మాయి..
లక్కవరపుకోట: మండలంలోని భీమాళి గ్రామంలో నాలుగురోజులుగా ‘పెళ్లికథ’ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. శ్రీరామాంజనేయ ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రంలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ సినిమా షూటింగ్ ఇదే తొలిసారి కావడంతో గ్రామస్తులందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. పిల్లలు సరదాగా గడుపుతున్నారు.
సినిమాలో ప్రధాన కథానాయికగా నటిస్తున్న ఎం.కీర్తనవర్మది లక్కవరపుకోట మండలం గనివాడ పంచాయతీ నిడుగట్టు గ్రామం. చిత్ర నిర్మాత వడ్డి రామాంజనేయులు, దర్శకులు జి.ఎన్.మూర్తిలు మాట్లాడుతూ పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. హీరోగా విశాఖపట్నం జిల్లా నాయుడుతోటకు చెందిన మనోహర్, కథానాయికులుగా వర్హ, ఇషిక, ఆయూష్లు నటిస్తున్నట్లు వివరించారు. సినిమాకు ఎం.ఎం.కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా కెమెరామన్గా బండి రామకృష్ణ వ్యవహరిస్తున్నారు.
మేకప్మన్గా డి.ఎ.రెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్గా ఎం.అప్పారావులు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమా 80 శాతం టాకీ మూవీ చిత్రీకరణ జరిగిందన్నారు. ఈ నెల మూడో వారంలో ఆడియో ఫం క్షన్ను హైదరాబాద్లో నిర్వహిస్తామని, జాన్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. సినిమా షూటింగ్కు గ్రామ సర్పంచ్ గుల్లిపల్లి రామునాయుడు, గ్రామ పెద్ద ముదునూరు శ్రీనివాస్వర్మలు సహకరిసుత్నా్నరు.
అదృష్టంగా భావిస్తున్నా..
నా మొదటి సినిమా మా ప్రాంతంలో షూటింగ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కథానాయికగా పెళ్లికథలో నటించేందుకు అవకాశం వచ్చింది. కుటుంబ కథా చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మ కం ఉంది. దర్శకనిర్మాతలు జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
–ముదుండి కీర్తనవర్మ, పెళ్లికథ కథానాయిక