చెప్పుతో బుద్ధి చెప్పండి : పవన్ కల్యాణ్
రాజాం : ఆడపిల్లలను ఏడ్పించే పోకిరీలకు చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పాలని సీనీనటుడు పవన్ కల్యాణ్ విద్యార్ధులకు పిలుపు నిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని సీఎంఆర్ ఐటీలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలపై వేధింపులు ఎక్కువయ్యాయని, ఎవరైనా వారిని ఏడిపిస్తే చెప్పుతో బుద్ధి చెప్పాలన్నారు. సొంత ఊరుని, కన్న తల్లిని ఎవరూ మరవ కూడదని హితవు పలికారు.