'ఆ రెండు పార్టీలను పవన్ కళ్యాణ్ నిలదీయాలి'
తిరుమల: బడ్జెట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. పదవుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆరోపించారు.
ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలని సూచించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ, బీజేపీలను పవన్ కళ్యాణ్ నిలదీయాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు.