ఉదయం 11గం.కు పవన్ మీడియా సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పర్యటించిన సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. కాగా రాజధాని కోసం రైతులు ఇష్టపడి భూములిస్తే సంతోషమే. ఇవ్వలేమన్న రైతులను వదిలేయడం మంచిది. కాదని ప్రభుత్వం మొండిగా భూ సేకరణకు దిగితే మాత్రం ఊరుకోను. బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తా, రోడ్డు మీదకొచ్చి జనసేన సత్తా చూపుతా అని పవన్ కల్యాణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.