‘ఆంధ్రుడు’ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్టౌన్ : లిటిల్ చాంప్స్ టాలెంట్ అకాడమీ ఆధ్వర్యంలో 2014 సంవత్సరానికి ఆంధ్రుడు పురస్కారం అందించేందుకు అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకులు బుచ్చేశ్వరరావు, సీతారామమ్మ, ఈదర చంద్రమౌలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమీ ఏర్పాటై ఆరేళ్లు పూర్తై సందర్భంగా ఈ ఏడాది ఆంధ్రుడు అవార్డు అందజేయనున్నట్లు చెప్పారు. సామాజిక, సేవారంగాలతోపాటు ఉపాధ్యాయులు కూడా ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప్రతి జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులకు ఈ పురస్కారం అందజేస్తామన్నారు. జిల్లాస్థాయిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఉత్తమ విద్యా సేవిక అవార్డు అందజేస్తామన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు నవంబర్ 10వ తేదీలోగా తమ దరఖాస్తులను ‘లిటిల్ చాంప్స్ అకాడమీ, డోర్ నంబర్ 38-7-421(2), రాంనగర్ 2వ లైను, ఒంగోలు’ అనే చిరునామాకు చేరేలా పంపించాలన్నారు. ఇతర వివరాలకు 96183 43805 నంబర్ను సంప్రదించాలని వారు కోరారు.