టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!

టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో విషాదం నెలకొంది. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఒక వ్యక్తి మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. 

 

ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో విఫలం కావడం వల్లనే ఓ వ్యక్తి మరణానికి కారణమైందని పలువురు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య వైఖరి నిరసిస్తూ మృతదేహంలో బంధువు ఆందోళన చేపట్టారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top