ఆటో, మోటర్ బైక్ ఢీ: ఒకరు మృతి


విజయనగరం: విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగాం వద్ద ఆటో, మోటారుసైకిల్ బుధవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వెంటనే స్పందించి క్షతగాత్రులను బొబ్బిలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.


బొబ్బిలి నుంచి నందిగాం వైపు ఆటో వస్తుండగా... మోటార్ సైకిల్ తెర్లాం నుంచి నందిగాం వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతిచెందిన మహిళను తెర్లాం మండలం ఆవిటి గ్రామానికి చెందిన గుడ్ల పార్వతమ్మ(50)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top