లారీ, బైక్ ఢీ: ఒకరు మృతి


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రమ్ వైద్య కళాశాల వద్ద లారీని బైక్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఏలూరు నగరంలోని జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రికి తరలించారు అయితే క్షతగాత్రల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top