పాముకాటుతో బాలిక మృతి
ఆలూరు(కర్నూలు): పాము కాటేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న బాలిక మృత్యువాతపడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం కాత్రికి గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లా వెంకటేశం తన భార్య, కూతురు కల్పన(11), కొడుకు ఈశ్వర్(6), తల్లితో కలసి రాత్రి తన పూరిగుడిసెలో నిద్రించగా, అర్థరాత్రి కల్పనను పాము కాటేసింది. ఆమె లేచి ఏడుస్తుండగా ఈశ్వర్ కూడా తనను ఏదో కుట్టిందంటూ నిద్రలేశాడు. కొద్దిసేపటికే కల్పన చనిపోయింది. ఈశ్వర్ను ఆస్పత్రికి తరలించారు.