రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


ఎడ్లపాడు(గుంటూరు): రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ఆయిల్ మిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం, మారుతీ కారు ఢీన్నాయి.


ఈ ఘటనలో మారుతీ కారులో ప్రయాణిస్తున్న గుంటూరు ఇన్సూరెన్స్ విభాగం ఏరియా మేనేజర్ డి. ఆనంద్(35) అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top