లారీ ఢీకొని సైక్లిస్టు మృతి


కొవ్వూరు (పశ్చిమగోదావరి) : మద్యం మత్తులో ఉన్న ఓ లారీ డ్రైవర్ అతి వేగంగా వాహనాన్ని నడిపి ఓ సైక్లిస్టు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆడికిరేవుల ఏటిగట్టు వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఆడికిరేవుల గ్రామానికి చెందిన వడ్డెర మేస్త్రి వానపల్లి నాగభూషణం(60) సైకిల్‌పై పక్కనే ఉన్న కుమారదేవం గ్రామానికి వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top