ఇటుకల ట్రాక్టర్ బోల్తా : కూలీ మృతి


రామకుప్పం (చిత్తూరు) : సిమెంటు ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.



మండలంలోని శాంతిపురం నుంచి వీర్నమల గ్రామం వైపు వెళ్తున్న సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ వీర్నమల వద్ద బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కూలీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top