రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించి ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మడకలవారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ప్రకాశం జిల్లా సింగరాయ కొండకు చెందిన భిక్షేశ్వరరావుగా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top