ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డ కారు
ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరులోని జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో వాహనం డివైడర్ను ఢీ కొట్టి... ఫ్లైఓవర్పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్ కు తరలించారు.
సంజీవరావు చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జల్లా పైడి చింతలపాడుకు చెందిన ఎస్ సంజీవరావు తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పయనమైయ్యారు. ఈ క్రమంలో అధికవేగంతో వెళ్తున్న వారి కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి... ఫ్లైఓవర్ పై నుంచి కిందపడింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.