లారీ ఢీకొని వ్యక్తి మృతి
బాలాయిపల్లి : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయిపల్లి మండలం అంబలపూడి వద్ద చోటుచేసుకుంది. లారీ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.