బతికుండగానే చనిపోయినట్టు చూపారు


తిరుపతి: ఓ వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్టు పంచాయతీ అధికారులు నివేదిక పంపారు. దీంతో ఆమెకు రావాల్సిన పింఛన్ నిలిపివేశారు. చిత్తూరు జిల్లా పత్తివేడులో సదవాలమ్మ అనే వృద్ధురాలి విషయంలో ఈ దారుణం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ పత్తివేడులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినపుడు ఈ విషయం వెలుగు చూసింది. వృద్ధురాలు కలెక్టర్ వద్ద తన గోడు వెల్లబోసుకుంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ పంచాయతీ ఉద్యోగిని సస్పెండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top