పాత నేరస్తుడి అరెస్టు: బంగారం స్వాధీనం
విజయనగరం: పలు నేరాలకు పాల్పడిన పాత నేరస్తుడు కొప్పుల రాజు ని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొప్పుల రాజుపై 14 కేసులు నమోదు అయ్యాయి. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, ఒక కేజీ వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించిన పోలీసులు అనంతరం కోర్టుకు తరలించారు.