శాసనసభ సాక్షిగా ఎన్టీఆర్ కంటతడి
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బల నిరూపణ కోసం అసెంబ్లీని సమావేశపరిచారు. బలనిరూపణ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడటానికి ఎంతో వేడుకున్నప్పటికీ అవకాశం ఇవ్వలేదు. తాను దిగిపోయిన ముఖ్యమంత్రిగా ఒకసారి మాట్లాడే అవకాశమివ్వాలని ఎంతగా బ్రతిమిలాడినా ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అంగీకరించలేదు.
దాంతో చేసేది లేక తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలతో కలసి ఎన్టీఆర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి, పార్టీ పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీ పేరుతో బ్యాంక్లో ఉన్న సొమ్మును కూడా చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు.