లాఠీలతో ఉద్యమాలను ఆపలేరు
చంద్రబాబుపై సీపీఎం నేతల ఆగ్రహం
అనంతపురం అర్బన్ : జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తూన్నాం.. నీ ఆస్థి ఇమ్మనో.? నీ ఆస్తులు జనానికి పంచమనో..? అడగట్లేదు. జిల్లాలో ఉన్న రైతు సుభిక్షంగా ఉండాలని పోరాటాలు చేస్తున్నాం..? అందుకు నీవ్వు ఏంచేస్తున్నావ్.. రకరకాల పోలీసుల పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావ్.. లాఠీలతో నువ్వు ఉద్యమాలను ఆపలేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఎం నాయకులు నిప్పులు చెరిగారు. గురువారం కొన్ని డిమాండ్లపై స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని సీపీఎం పార్టీ చేపట్టింది. సమస్యలపై ప్రస్తావిస్తూండగానే రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఓబులతో పాటు నగర అధ్యక్షుడు నాగేంద్రకుమార్, ఐద్వా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, ప్రధాన కార్యదర్శి సావిత్రమ్మ, ఆర్వి నాయుడు, ప్రకాష్, దిల్షాద్, అవాజ్ నాయకులు వలీ, ముత్తుజా, చండ్రాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆంజి, భవన కార్మికసంఘం నాయకుడు రామాంజి, తదితరులు పోలీసులు అరెస్ట్ చేశారు.
దాదాపు గంటన్నర పాటు పోలీసులకు సీపీఎం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఓబులను అరెస్ట్ చేయడంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో అక్కడున్న ఎస్ఐ రెడ్డప్ప.. ఇక్కడ నుంచి పోండి.. మీ కథ తెలుసులే.. అంటూ. మహిళలపై మాట్లాడంతో మహిళలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎస్ఐపై మాటల యుద్ధంతో తిరగబడ్డారు. మా గురించి నీకు ఏం తెలుసు..? మా కథ నీకు ఏం తెలుసు అంటూ..? ప్రశ్నించడంతో ఎస్ఐ సమాధానం చెప్పలే ని పరిస్థితిని గమనించిన సీఐ శుభకుమార్ మహిళలకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమునిగింది.
సంబంధిత వార్తలు