'కరువు అంచనా వేసేది ఇలాగేనా?'

'కరువు అంచనా వేసేది ఇలాగేనా?' - Sakshi


అనంతపురం : కేంద్ర కరువు బృందంపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లిలో కేవలం 5 నిమిషాలే పర్యటించడంపై గురువారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు అంచనా వేసేది ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. కరువు బృందం పర్యటనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.



కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్‌అహ్మద్ నేతృత్వంలో డీఏసీ జేడీ నరేంద్రకుమార్, మానిటరింగ్ అండ్ అప్రైసర్ డెరైక్టరేట్ డెరైక్టర్ పంకజ్‌త్యాగి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఏపీ రీజియన్ డీజీఎం గోవర్థన్‌రావులతో కూడిన బృందం బుధవారం అనంతపురంలో పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లాకు తక్షణ సాయంగా రూ. 1,404.55 కోట్లు అవసరమని కలెక్టర్ కోనశశిధర్ కేంద్ర బృందానికి వినతిపత్రం అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top