'ఆంధ్రావాళ్లకు తెలంగాణలో పోస్టులివ్వొద్దు'
హైదరాబాద్: నీటి పారుదల శాఖలో 5, 6 జోన్లల్లో నియామకాలు పొందినా, మొదటి నుంచీ లేదా అధిక కాలం ఆంధ్ర ప్రాంతంలో పనిచేసిన ఆ ప్రాంత ఇంజనీర్లకు తెలంగాణలో పోస్టింగులు ఇవ్వరాదని రాష్ట్ర ఇంజ నీర్ల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వెంకటేశం, కార్యదర్శులు మహేందర్, శేఖర్రెడ్డి, విజయ్కుమార్ ప్రకటన విడుదల చేశారు.