అంధకారంలో 5 గ్రామాలు


ప్రకాశం: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెగపూడిలో ఈదురుగాలుల దాటికి 5 గ్రామాల్లో అంధకారం నెలకొంది. వెలగపూడి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్ వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


దీంతో 5 గ్రామాలు శనివారం అర్ధరాత్రినుంచి అంధకారంలోనే ఉండాల్సి వస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top