రుణమాఫీపై బడ్జెట్లో అస్పష్టత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రుణమాఫీపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పూర్తి అస్పష్టంగా చెప్పారు. మొత్తం లక్ష కోట్లకు పైగానే బడ్జెట్ అంచనాలు రూపొందించినా, అందులో రుణమాఫీ అంశానికి ఎంత మొత్తం కేటాయిస్తున్నామనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనే లేదు. ప్రతి కుటుంబానికి రుణ మాఫీ కోసం లక్షన్నర రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు గానీ, అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తున్న నిధులెన్నో మాత్రం చెప్పలేదు.
అలాగే.. అందులో డ్వాక్రా రుణాల మాఫీ వాటా ఎంత, వ్యవసాయ రుణాల మాఫీ ఎంత, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాల విషయం ఏంటనే విషయాలను కూడా ఏమాత్రం ప్రస్తావించకుండా వదిలేశారు. కాగా గురువారం అసెంబ్లీకి సెలవు కావడంతో శుక్రవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టే వ్యవసాయ బడ్జెట్లో ఈ విషయం ఉంటుందని చెబుతున్నారు. అప్పటివరకు ఆగితే.. అప్పుడు ఏం చెబుతారో తెలుస్తుంది.