కొలిక్కిరాని ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ
హైదరాబాద్ : ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్కు సంబంధించి 174 కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియపై ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. కళాశాలలే అడ్మిషన్లు వ్యవహారం చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లను కాలేజీ యాజమాన్యాలు కోరాయి.
అయితే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా వెళ్లలేమని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తెలిపింది. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు కోరితే తాము కౌన్సెలింగ్ నిర్వహించటానికి సిద్ధమని తెలంగాణ ఉన్నత విద్యామండలి వెల్లడించింది. 174 కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియకు ఏపీ ఉన్నత విద్యామండలికి ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. అంతా తామే చూసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తోంది.