'498 - ఎ కేసు పెట్టగానే అరెస్టులు వద్దు'

'498 - ఎ కేసు పెట్టగానే అరెస్టులు వద్దు' - Sakshi


న్యూఢిల్లీ: వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదివారం పలు సూచనలు చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ మహిళలు చేసే ఫిర్యాదులతో 498 - ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినా ...  వెంటనే ఎవరినీ అరెస్ట్ చేయవద్దని సూచించింది. భార్యా, భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో సెక్షన్ 498-ఎ ను కొంతమంది ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది.


ఈ నేపథ్యంలో కేసు పెట్టిన వెంటనే అరెస్టులు చేయవద్దని సూచించింది. ఈ మేరకు పోలీసు అధికారులను తగు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. కేసు నమోదు అయిన తర్వాత పూర్వాపరాలు పరిశీలించి... అవసరమనుకుంటేనే అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన సూచనల్లో పేర్కొంది.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top