త్వరలో నూతన మద్యం విధానం: కొల్లు రవీంద్ర


గుంటూరు: త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఏపీ ఎక్సైజ్ , చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేనేత రుణాలు ఎన్ని కోట్లున్నా రద్దు చేస్తామన్నారు. ఏపీ రాజధానిపై అందరి ఆమోదంతోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో నూతన మద్యం విధానాన్ని ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు.  అంతకుముందు శ్రీలక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. శ్రీగంగా భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top