ఒక్కటైన నేపాల్ అమ్మాయి... ఆంధ్రా అబ్బాయి

ఒక్కటైన నేపాల్ అమ్మాయి... ఆంధ్రా అబ్బాయి - Sakshi


ద్వారకా తిరుమల: నేపాల్ అమ్మాయికి... ఆంధ్ర అబ్బాయికి ఢిల్లీలో చిగురించిన ప్రేమ బంధం చిన వెంకన్న క్షేత్రంలో మూడుముళ్ల బంధమైంది. బుగ్గన చుక్క, నుదుటున కల్యాణ తిలకంతో సిగ్గులొలుకుతున్న ఆ నేపాల్ వధువుకు హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా బుధవారం ఉదయం  జరిగిన ఈ వివాహవేడుకకు ద్వారకాతిరుమల శ్రీవారి శేషాచలకొండ వేదికైంది.


జిల్లాలోని పోడూరు మండలం జిన్నూరుకు చెందిన పెచ్చేటి వెంకటేష్ ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో సాఫ్ట్వేర్గా పని చేస్తున్న నేపాల్ యువతి రీణాతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది క్రితం నుంచి ప్రేమించుకుంటున్న వీరు ఈ విషయాన్ని పెద్దలకు తెలిపి... వివాహానికి వారి అంగీకారాన్ని పొందారు.


దీంతో శేషాచలకొండపై ఉన్న టీటీడీ కాల్యాణ మండపంలో వీరి వివాహం సంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో నేపాలీలు చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి దేవస్థానం ఈవో.. ఈ వివాహనికి హాజరై... నూతన వధూవరులకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి... ఆశీర్వదించారు. అనంతరం కొత్త జంట శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top