నత్తారామేశ్వరం ఏకే ఆర్ట్స్‌లో పవన్‌కళ్యాణ్ విగ్రహానికి రూపకల్పన

నత్తారామేశ్వరం ఏకే ఆర్ట్స్‌లో పవన్‌కళ్యాణ్ విగ్రహానికి రూపకల్పన - Sakshi


నత్తారామేశ్వరం: పశ్చిమగోదావరి జిల్లా ,గరువు(పెనుమంట్ర) నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో సినీహీరో,జనసేన నాయకుడు పవన్‌క ళ్యాణ్ శిలా విగ్రహాన్ని శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరులు రూపొందించారు.



తాడేపల్లిగూడెంలో పవన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాడేపల్లిగూడెంకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన నాయకుడు సీతాల మోహన్‌చందు అనే వ్యక్తి ఇచ్చిన ఆర్డరు మేరకు ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు అరుణప్రసాద్ తెలిపారు.



విగ్రహాన్ని పూర్తిచేసిన అనంతరం నమూనా ఫొటోలను పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లి ఆయన అనుమతి మేరకు తాడేపల్లిగూడెంలో విగ్రహాన్ని పవన్‌యూత్ ఆద్వర్యంలో అభిమానులంతా విగ్రహ ప్రతిష్టచేసేందుకు సన్నహాలు చేస్తామని శుక్రవారం నత్తారామేశ్వరగ్రామంలో చందు విలేకరులకు వెల్లడించారు.



ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ అభిమానుల కోరికమేరకు విగ్రహాన్ని రూపొందించడం జరిగిందని ఆయన అభిమానులు తమ ఏకే ఆర్ట్స్‌కు వచ్చి విగ్రహాన్ని ఆర్డర్ ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top