ఎవరిని ఓడించాలో కాపు జాతికి తెలుసు
ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాలనే తాపత్రయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడలో కాపులతో సమావేశం నిర్వహించి కాపుల చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టారని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నంద్యాల ఎన్నికలో ఎవరిని ఓడించాలో తెలుసుకోలేని స్థితిలో కాపు జాతి లేదన్నారు. విజయవాడ సమావేశంలో శుభవార్త చెబుతారనుకుంటే రెండోసారీ తమ చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కాగా ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను బుధవారం కూడా పోలీసులు అడ్డుకున్నారు.