ఎన్ని ఇబ్బందులు పెట్టినా మడమతిప్పం: ముద్రగడ

ఎన్ని ఇబ్బందులు పెట్టినా మడమతిప్పం: ముద్రగడ - Sakshi

కిర్లంపూడి (జగ్గంపేట): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా, అణచివేతకు గురిచేసినా ఉద్యమం నుంచి మడమ తిప్పబోమని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ఉధృతం చేయాలని కాపు జాతికి ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమం ఆఖరిదశలో ఉన్నందున యావత్తు కాపుజాతి ఉద్యమంలో పాలుపంచుకోవాలన్నారు.



తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామం కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను గత 25 రోజులుగా పోలీసులు నిత్యం ఇంటిగేటు వద్దే అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. శనివారం ముద్రగడ, కాపునేతలు యథావిధిగా గేటు వద్ద కుర్చీలపై బైఠాయించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలిపారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top